చండీఘడ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూస్వాలా హత్యకు సంబంధించిన కేసులో ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. అమృత్సర్ జిల్లాలోని భాక్నా కలనౌర్లో పోలీసులకు, గ్యాంగ్స్టర్ల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ గ్యాంగ్స్టర్ జగరూప్ సింగ్ రూప హతమయ్యాడు. యాంటీ గ్యాంగ్స్టర్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నారు. భాక్నా గ్రామంలో భారీ స్థాయిలో పోలీసులు మోహరించి ఉన్నారు. జగ్రూప్ రూపా, మన్నూ కోసాలు ఆ గ్రామంలో ఉన్నట్లు తేలింది. ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. ప్రస్తుతం ఎన్కౌంటర్ ఇంకా జరుగుతోంది.