భోపాల్: గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతిక్ అహ్మద్(Atiq Ahmed)ను ఉత్తరప్రదేశ్కు తీసుకువచ్చారు. ఆయన్ను ప్రయాగ్రాజ్లోని నైని జైలుకు తరలించనున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా నుంచి ఇవాళ ఉదయం యూపీలోకి అతిక్ అహ్మద్ కాన్వాయ్ ఎంటరైంది. ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్లోని సెంట్రల్ జైలు(Ahmedabad central jail) నుంచి అతిక్ను బయటకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తెల్ల టర్బన్ కట్టుకున్న అతిక్ను పోలీసు వ్యాన్లో తరలించారు. తనను మర్డర్ చేసే అవకాశాలు ఉన్నట్లు అతను భయాందోళనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఓ కోర్టు కేసు నిమిత్తం అతిక్ అహ్మాద్ను యూపీలోని ప్రయాగ్రాజ్(Prayagraj)కు తరలించారు.గతంలో సమాజ్వాదీ పార్టీ తరపున ఆయన ఎంపీగా చేశారు. 2019 జూన్ నుంచి సబర్మతి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారి మోహిత్ జైశ్వాల్(Mohit Jaiswal) కిడ్నాప్, దాడి కేసులో అతన్ని జైలుకు తరలించారు.
అతిక్ అహ్మద్పై సుమారు వంద క్రిమినల్ కేసులు(criminal cases) ఉన్నాయి. తాజాగా ఉమేశ్ పాల్ మర్డర్ కేసు కూడా నమోదు అయ్యింది. గ్యాంగ్స్టర్ వికాశ్ దూబే తరహాలోనే అతిక్ అహ్మాద్ను హతమారుస్తారన్న ఊహాగానాలు వినిపించాయి.