బెంగళూరు, మార్చి 31: కర్ణాటకలో దారుణం జరిగింది. ఈ నెల 25న రాత్రి 10 గంటల సమయంలో కోరమంగళలోని నేషనల్ గేమ్స్ విలేజ్ పార్కులో కూర్చున్న ఓ మహిళను నలుగురు కామాంధులు కిడ్నాప్ చేసి.. నడుస్తున్న కారులో సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
ఆ మరుసటి రోజు ఉదయం ఆ మహిళను తన ఇంటివద్ద దింపేసిన నిందితులు..లైంగికదాడి గురించి పోలీసులకు ఫిర్యాదుచేస్తే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమెను బెదిరించారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు శుక్రవారం పోలీసులు వెల్లడించారు.