అహ్మదాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ మరోసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్లోని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓఖా, భన్వాద్, థారా మున్సిపాలిటీలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో మోదీ తల్లి హీరాబెన్ గాంధీనగర్ పరిధిలోని రేసన్ గ్రామంలోని పోలింగ్ బూత్కు కారులో వచ్చారు. క్యూలో ఉండి ఓటు వేశారు. అక్కడి సిబ్బంది ఆమెకు సహకరించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, గాంధీనగర్ మున్సిపర్ కార్పొరేషన్లోని 44 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 161 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీజేపీ 44 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, ఆప్ 40 స్థానాల చొప్పున స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగాయి.