న్యూఢిల్లీ: చమురు ధరలు భగ్గుమంటున్నాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా నాలుగో రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్పై 35 పైసల చొప్పున పెంచాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.108.99కి చేరగా, డీజిల్ రూ.97.72కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్ రూ.114.81, డీజిల్ రూ.105.86, కోల్కతాలో పెట్రోల్ రూ.109.46, డీజిల్ రూ.100.84, చెన్నైలో పెట్రోల్ రూ.105.74, డీజిల్ రూ.101.92కి చేరాయి.
హైదరాబాద్లో లీటరు పెట్రోల్పై 36 పైసలు, డీజిల్పై 38 పైసల చొప్పున పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ.113.36, డీజిల్ ధర రూ.106.60కు చేరింది.