పట్నా : పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గించడంపై ఆర్జేడీ వ్యవస్ధాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. ఈ తగ్గింపు ఏమాత్రం సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంధన ధరల తగ్గింపు తాత్కాలికమేనని, యూపీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం మరోసారి పెట్రో భారాలు తప్పవని లాలూ స్పష్టం చేశారు. పెట్రోల్ ధరను లీటర్కు రూ 5 తగ్గించి మోదీ ప్రభుత్వం డ్రామా ఆడుతోందని అన్నారు.
ఇంధన ధరలు లీటర్కు రూ 50 తగ్గితేనే ప్రజలకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ఇక పెట్రోల్ ధరలు లీటర్కు రూ 70 లోపు తగ్గించాలని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. గతంలో బీజేపీ నేతలు పెట్రోల్ ధరలు రూ 70 ఉండగా ధరలు ఎగబాకాయని గగ్గోలు పెట్టారని ఇప్పుడు ఇంధన ధరలను కనీసం రూ 70కి దిగువకు తీసుకువచ్చేలా కాషాయ నేతలు చొరవచూపాలని డిమాండ్ చేశారు.