భోపాల్: ఫిర్యాదుపై దర్యాప్తులో నిర్లక్ష్యంపై దంపతులు వినూత్నంగా నిరసన తెలిపారు. పోలీస్ అధికారికి పూజలు చేయడంతోపాటు హారతి ఇచ్చారు. (Couple Performs Aarti to Police) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ ఏడాది జనవరిలో ఒక జ్యుయలరీ షాపులో పని చేసే ఇద్దరు సిబ్బంది అర్పిత్, ముఖేష్ కలిసి నాలుగు కిలోల వెండి చోరీ చేసి పారిపోయారు. ఈ చోరీ గురించి ఆ షాపు యజమాని రేవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
కాగా, అదృశ్యమైన నిందితులు హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. దీంతో ఫిర్యాదుపై కేసు నమోదులో ఆలస్యంతోపాటు పోలీసులు ఎలాంటి దర్యాప్తు చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై జ్యుయలరీ షాపు దంపతులు అనురాధ, కుల్దీప్ సోని అసంతృప్తి చెందారు. ఈ నేపథ్యంలో ఈ నెల 6న ఆ దంపతులు స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లారు. సీఐ జేపీ పటేల్ వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు. ఆయనకు పూజలు చేసి హారతి ఇచ్చారు. మెడలో పూల దండ వేసి శాలువా కప్పేందుకు ప్రయత్నించారు. దీనిని సహించని ఆ పోలీస్ అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయడంతోపాటు ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ దంపతులు తనను అవమానించారని, తన విధులకు ఆటంకం కలిగించారని ఆ పోలీస్ అధికారి ఆరోపించాడు. ఈ నేపథ్యంలో ఆ దంపతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు దృష్టికి కూడా ఇది వెళ్లగా, ఆ దంపతుల ప్రవర్తనను కోర్టు తప్పుపట్టింది.
#मध्य_प्रदेश के #मप्र रीवा सिटी कोतवाली थाना प्रभारी जेपी पटेल द्वारा कार्रवाई नहीं करने पर एक महिला ने थाने में जाकर उनकी उतारी आरती !!
वीडियो सोशल मीडिया पर जमकर हो रहा वायरल !!
आप भी देखिये वीडियो और दीजिये अपनी राय !!#Rewa #viralvideo pic.twitter.com/vBQyIXZ12C
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) April 9, 2024