న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే నేతలు రాజస్థాన్లోని మా భగవతి దేవాలయానికి పరుగులు తీస్తున్నారు. శతాబ్దాల చరిత్రగల ఈ గుడి శక్తిపురి, శివపురి, విష్ణు పురి కోటల మధ్య ఉంది. అందుకే దీనిని మా త్రిపుర సుందరి దేవాలయం అని కూడా పిలుస్తారు. శ్రీ యంత్రం, 18 చేతులుగల ఈ అమ్మవారు రాజ్యాధికారాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది. అందుకే సర్పంచ్ సహా ఎంపీ, ఎమ్మెల్యే పదవుల కోసం పోటీ పడేవారు ఇక్కడికి వచ్చి, ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. 2013లో జరిగిన రాజస్థాన్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రోజున బీజేపీ నేత వసుంధర రాజే సింధియా ఈ గుడిలోనే ఉండిపోయారు. రోజంతా ఇక్కడే ఉండి పూజలు చేశారు.