ముంబయి: అమ్మాయి పేరు మేధా రాయ్. ఆమెది ముంబయి. అబ్బాయి పేరు హాక్ విక్టర్. అతడిది జర్మనీ. ఇద్దరూ భారత్లో ప్రేమించుకున్నారు. జర్మనీలో పెళ్లాడారు. కానీ, కొవిడ్ ఆంక్షల వల్ల పెండ్లికి అమ్మాయి తల్లిదండ్రులు వెళ్లలేకపోయారు. దీంతో భార్యాభర్తలు కలిసి భారత్కు వచ్చి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలనుకున్నారు. ఈ జర్నీ జీవితాంతం గుర్తుండే మెమొరీ కావాలనుకున్నారు. ఫ్లైట్లో కాకుండా రోడ్డు మార్గం ద్వారా ప్రయాణిద్దామని నిర్ణయించారు. ముందు కారులో వద్దామనుకున్నా ఖర్చు ఎక్కువ అవుతుందని బైక్ రైడ్ ప్రారంభించారు. భార్యాభర్తలు ఇద్దరు రెండు బైక్లపైన 18 దేశాలను దాటి 156 రోజుల్లో 24 వేల కిలోమీటర్లు ప్రయాణించి ముంబయికి చేరుకున్నారు.