చండీగఢ్: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్నది. కరోనా కొత్త వేరియంట్ విజృంభిస్తుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు, నిబంధనల బాటపట్టాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నది. టీకా రెండు డోసులు తీసుకోని వ్యక్తులను జనవరి 1 నుంచి బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశానికి అనుమతించబోమని తెలిపింది. కళ్యాణ మండపాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, కార్యాలయాలు, బ్యాంకులు లేదా మరే ఇతర బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ అని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ తెలిపారు. ఒమిక్రాన్, కరోనా మూడవ వేవ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికే ఈ నిబంధన అని చెప్పారు.