న్యూఢిల్లీ, జనవరి 20: ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలున్నాయి. రెండు రోజులపాటు భారత్లో పర్యటించనున్న మాక్రాన్ పలు ఒప్పందాలు చేసుకోనున్నారు.
ముఖ్యంగా రక్షణ, భద్రత, క్లీన్ ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త సాంకేతికత తదితర రంగాల్లో ఒప్పందాలు జరుగనున్నట్టు తెలుస్తున్నది. పర్యటనలో భాగంగా మాక్రాన్ ఢిల్లీతోపాటు జైపూర్ను సందర్శించనున్నారు.