న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court) టెక్నాలజీకి పెద్దపీట వేసింది. అడ్వకేట్లకు, ఫిర్యాదుదారులకు ఉచిత వైఫై సదుపాయాల్ని కల్పించనున్నది. సుప్రీంకోర్టు వ్యవహారాలన్నీ పేపర్లెస్గా సాగేందుకు ఏర్పాట్లు చేసింది. ఒకటో నెంబర్ నుంచి అయిదో నెంబర్ కోర్టు వరకు ఉచిత వైఫై సేవల్ని అందిచనున్నట్లు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. బార్ రూమలకు త్వరలో ఈ సేవల్ని విస్తరించనున్నట్లు ఆయన చెప్పారు. కోర్టుల్లో బుక్లు, పేపర్ల వాడకం తగ్గుతుందని ఆయన తెలిపారు. కోర్టు రూములన్నీ కొత్త లుక్లో కనిపిస్తాయని, ఎందుకంటే టెక్నాలజీ సంబంధిత సెటప్తో దర్శనమిస్తాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాలతో పాటు స్క్రీన్లు ఉంటాయన్నారు.