న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: గుజరాత్లో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేసి దవాఖానలకు మెడికల్ ఆక్సిజన్ను ఉచితంగా సరఫరా చేయనున్నట్టు ఎరువుల సంస్థ ఇఫ్కో ఆదివారం ప్రకటించింది. మరోవైపు, దవాఖానలకు రోజుకు 200-300 టన్నుల చొప్పున మెడికల్ ఆక్సిజన్ను సరఫరా చేస్తామని టాటా స్టీల్ తెలిపింది. తాము కూడా రోజుకు 50-100 టన్నుల చొప్పున ఆక్సిజన్ను సరఫరా చేస్తామని జేఎస్పీఎల్ సంస్థ, రోజుకు 200 టన్నుల చొప్పున ఆక్సిజన్ను ఇస్తామని ఏఎమ్ఎన్ఎస్ కంపెనీ వెల్లడించింది. కొవిడ్-19 పోరులో భాగంగా 33,300 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను సరఫరా చేయనున్నట్టు సెయిల్ సంస్థ ప్రకటించింది.