Emmanuel Macron | ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ (France) అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు (Indian students) ఫ్రాన్స్లో చదువుకునే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తద్వారా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింతగా బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించి ఎక్స్లో పోస్ట్ చేశారు. తన పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తుందని మాక్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్’ చొరవతో విశ్వవిద్యాలయాల్లో ఫ్రెంచ్ నేర్చుకోవడానికి ఒక నెట్వర్క్ను సృష్టిస్తామని వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం అంతర్జాతీయ తరగతులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఫ్రాన్స్లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని ఈ సందర్భంగా మాక్రాన్ వెల్లడించారు. ఇక 2025నాటికి 20 వేల మంది విద్యార్థులను ఫ్రాన్స్కి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
30,000 Indian students in France in 2030.
It’s a very ambitious target, but I am determined to make it happen.
Here’s how: pic.twitter.com/QDpOl4ujWb
— Emmanuel Macron (@EmmanuelMacron) January 26, 2024
Also Read..
Harish Rao | న్యాయసూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకేలా ఉండాలి: హరీశ్ రావు
Family Star | విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్గా సందడి చేసే టైం ఫిక్స్..!
Mrunal Thakur | అందుకు గర్వపడుతున్నా.. తెలుగు పరిశ్రమ ఆ లోటును తీర్చింది: మృణాల్ ఠాకూర్