ముంబై: మహారాష్ట్రలో గూడ్స్ రైలు బోల్తా పడింది. రైలు పాన్వెల్ నుంచి వసాయ్కి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి. దాంతో కళ్యాణ్, కుర్లా రైల్వే స్టేషన్ల నుంచి ఘటనా ప్రాంతానికి యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లను పంపించారు. గూడ్స్ రైలు బోల్తా పడటంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని అధికారులు తెలిపారు. బోల్తా పడిన బోగీలను రైలు పట్టాల పై నుంచి తొలగించిన తర్వాత రైళ్ల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు వెల్లడించారు. రైలు బోల్తా పడటానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు.