తిరువనంతపురం: కేరళలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తున్నది. ఇక్కడ ఆదివారం నలుగురిలో ఒమిక్రాన్ బయటపడగా ఇవాళ మరో నలుగురిలో ఆ డేంజర్ వేరియంట్ ఉన్నట్లు తేలింది. దాంతో కేరళలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 15కు చేరింది. ప్రస్తుతం అధికారులు అందరినీ సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంచారు. కొత్తగా ఒమిక్రాన్ బారినపడిన నలుగురి ప్రాథమిక కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు. కేరళ వైద్యారోగ్య శాఖ సోమవారం ఉదయం ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది.