చెన్నై : తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో నలుగురు మరణించారని నీలగిరి జిల్లా కలెక్టర్ ధ్రువీకరించారు. ఘటనా స్ధలంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయని, హెలికాఫ్టర్లో మొత్తం 14 మంది ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ హెలికాఫ్టర్లో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్ సహా కుటుంబ సభ్యులు, ఆయన సిబ్బంది ఉన్నారని చెబుతున్నారు. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయలుదేరిన హెలికాఫ్టర్ కోయంబత్తూర్, కూనూర్ మధ్య కుప్పకూలింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని వాయుసేన అధికారులు తెలిపారు.