న్యూఢిల్లీ, జనవరి 31: బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో అపార అనుభవం కలిగిన నలుగురిని 16వ ఆర్థిక సంఘం ఫుల్టైమ్ సభ్యులుగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాలు జారీచేశారు. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మెన్ అరవింద్ పనగరియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా గత ఏడాది డిసెంబర్లో నియమితులయ్యారు. మిగతా సభ్యులుగా.. కేంద్ర మాజీ కార్యదర్శి ఏఎన్ ఝా, మాజీ బ్యూరోక్రాట్ అన్నీ జార్జ్ మాథ్యూ, ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్, అర్ధ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరంజన్ రాజాధ్యాక్షలను నియమిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.