న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పండిట్ సుఖ్ రామ్ (Pandit Sukh Ram) కన్నుమూశారు. 94 ఏండ్ల సుఖ్ రామ్కు ఈ నెల 4న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో హిమాచల్ప్రదేశ్లోని మండి దవాఖానలో చేరారు. అయితే మే 7న మెరుగైన చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్లో న్యూఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. ఈమేరకు ఆయన మనవడు ఆశ్రయ్ శర్మ ఫేస్బుక్ ద్వారా వెల్లడించారు.
హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి సుఖ్రామ్ మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1993-1996 మధ్యకాలంలో కేంద్ర ప్రసారాల వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1963 నుంచి 1984 వరకు మండి ఎమ్మెల్యేగా ఐదుసార్లు గెలుపొందారు. రాష్ట్ర పశుసంవర్ధక మంత్రిగా పనిచేశారు. 1984లో మొదటిసారి ఎంపీగా విజయం సాధించిన ఆయన దివంగత ప్రధాని రాజీవ్గాంధీ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేశారు.