చంఢీఘడ్: హర్యానాలో కమల దళానికి షాక్ తగిలింది. ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బీరేందర్ సింగ్( Birender Singh).. ఇవాళ బీజేపీ పార్టీకి గుడ్బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు. ఆయన కుమారుడు బ్రిజేంద్ర సింగ్ గత నెలలో బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరారు. హిస్సార్ ఎంపీ అయిన బ్రిజేంద్ర సింగ్..రాజకీయ వత్తిళ్ల వల్ల ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. బీరేందర్ 2020లో ఎగువ సభ నుంచి రిజైన్ చేశారు. బ్రిజేంద్ర తన ఐఏఎస్ పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన హిస్సార్ ఎంపీగా గెలిచారు.