మెహసన (గుజరాత్), ఫిబ్రవరి 19: గుజరాత్లోని ఒక గ్రామంలో నోట్ల వర్షం కురిసింది. మాజీ సర్పంచ్ ఒకరు తన మేనల్లుడి వివాహం సందర్భంగా పెద్దయెత్తున నోట్లను వెదజల్లడంతో వాటిని ఏరుకోవడానికి జనం పెద్ద సంఖ్యలో ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
మెహసన జిల్లాలోని ఒక గ్రామంలో మాజీ సర్పంచ్ కరీం యాదవ్ తన మేనల్లుడు రజాక్ వివాహం సందర్భంగా మేడ మీద నుంచి కుటుంబ సభ్యులతో కలిసి నోట్లను వెదజల్లారు. 100, 500 నోట్లను విసరడంతో వాటిని ఏరుకోవడానికి జనం పోటీపడ్డారు.