జైపూర్, డిసెంబర్ 22: తనపై సర్వీసు సమయంలో పలు సందర్భాల్లో పలువురు న్యాయమూర్తులు, లాయర్లు వేధింపులకు పాల్పడ్డారని, వారిపై ఫిర్యాదులు చేసిన ఫలితంగా తాను ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చిందని రాజస్థాన్కు చెందిన ఎలిజా గుప్తా అనే ఓ మహిళా జడ్జి ఆరోపించారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె ఈ నెల 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్కు లేఖ రాశారు. సీజేఐకి లేఖ రాసిన యూపీ జడ్జిని స్ఫూర్తిగా తీసుకుని తాను కూడా లేఖ రాసినట్టు ఎలిజా గుప్తా పేర్కొన్నారు. అయితే ఎలిజా గుప్తా ఆరోపణలను నాగౌర్కు చెందిన పలువురు లాయర్లు ఖండించారు. ఎలిజా గుప్తా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు.