చండీఘఢ్ : పంజాబ్ మాజీ స్పీకర్, అకాలీదళ్ (ఎస్ఏడీ) సీనియర్ నేత నిర్మల్ సింగ్ కహ్లాన్ (79) దీర్ఘకాలంగా అస్వస్ధతతో బాధపడుతూ శనివారం మరణించారు. పార్టీ సీనియర్ నేత మరణం పట్ల ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ సంతాపం వ్యక్తం చేశారు. కహ్లాన్ తామందరిలో స్ఫూర్తి నింపేవారని, ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్న బాదల్ దివంగత నేత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నిర్మల్ సింగ్ కహ్లాన్ గతంలో పంజాబ్ స్పీకర్గా, మంత్రిగానూ విలువైన సేవలందించారు. కహ్లాన్ మరణం బాధాకరమని పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రజా సంతాపం వ్యక్తం చేశారు. ఇక కహ్లాన్ భౌతికకాయానికి ఆదివారం గురుదాస్పూర్ జిల్లాలోని ఫతేగఢ్ సమీపంలోని దదుజోధ్ గ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.