న్యూఢిల్లీ: భారత్కు వ్యతిరేకంగా కార్గిల్లో యుద్ధం చేయాలనే తలంపును వ్యతిరేకించినందుకే తనను పదవి నుంచి తొలగించారని, దేశం నుంచి వెళ్లగొట్టారని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చెప్పారు. భారత్ సహా ఇతర ముఖ్యమైన పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలని తాను చెప్పానని, అప్పట్లో సైన్యానికి నాయకత్వం వహించిన జనరల్ పర్వేజ్ ముషారఫ్ అందుకు అంగీకరించలేదని చెప్పారు.
‘1993, 1999లలో నన్ను పదవి నుంచి ఎందుకు తొలగించారో నాకు చెప్పాలి. కార్గిల్ యుద్ధ ప్రణాళికను నేను వ్యతిరేకించినపుడు, నన్ను పదవి నుంచి తొలగించారు. నేను చెప్పినదే సరైనదని ఆ తర్వాత రుజువైంది’ అని నవాజ్ షరీఫ్ చెప్పారు. తాను మూడుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశానని, అప్పట్లో తాను దేశానికి మెరుగైన సేవలందించానని తెలిపారు. అయినప్పటికీ తనను పదవి నుంచి ఎందుకు తొలగించారో తెలియడం లేదన్నారు. ఆ సమయంలో ఇద్దరు భారత ప్రధానమంత్రులు పాకిస్థాన్లో పర్యటించారని చెప్పారు.