భువనేశ్వర్: కాంగ్రెస్ పార్టీ తనను అవమానించిందని భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ప్రబోధ్ టిర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎయిరిండియాలో ఉద్యోగం వదులుకుని గత సెప్టెంబరులో కాంగ్రెస్లో చేరారు.
ఒడిశాలోని తల్సారా శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆయనకు ఆ పార్టీ ఈ నెల 2న టికెట్ ఇచ్చింది. కానీ ఈ నెల 14న ఆ పార్టీ విడుదల చేసిన రెండో జాబితాలో ఆయన పేరును తొలగించింది. అయితే ఈ మార్పు గురించి తనకు మాట మాత్రంగానైనా కాంగ్రెస్ పెద్దలు చెప్పలేదని ప్రబోధ్ ఆవేదన వ్యక్తం చేశారు.