న్యూఢిల్లీ, నవంబర్ 19: కేంద్ర ఎన్నికల కమిషనర్గా మాజీ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిషనర్లు ఉంటారు. ప్రస్తుతం ప్రధాన కమిషనర్గా రాజీవ్కుమార్, కమిషనర్గా అనూప్ చంద్రపాండే ఉన్నారు. సుశీల్చంద్ర పదవీ విరమణతో రాజీవ్ కుమార్ ప్రధాన కమిషనర్గా నియమితులయ్యారు. దీంతో కమిషనర్ పదవి ఖాళీ అయింది. ఆర్నెల్లుగా ఇది ఖాళీగా ఉన్నది. తాజాగా ఆ స్థానంలో అరుణ్గోయల్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్కుమార్ 2025 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత అరుణ్గోయల్ సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.