న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్, కేంద్ర మాజీ మంత్రి మనోహర్ సింగ్ గిల్ కన్నుమూశారు. 86 ఏండ్ల గిల్ స్వల్ప అస్వస్థతతో దక్షిణ ఢిల్లీలోని ఒక దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గిల్ అంత్యక్రియలు సోమవారం నిర్వహిస్తారు. ఆయన 1996 డిసెంబర్ నుంచి 2001 జూన్ వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా వ్యవహరించారు. టీఎన్ శేషన్ సీఈసీగా ఉన్నప్పుడు గిల్తో పాటు జీవీజీ కృష్ణమూర్తి సభ్యులుగా ఉండేవారు. గిల్ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి రాణించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై 2008లో కేంద్ర క్రీడాశాఖ మంత్రిగా పనిచేశారు.