న్యూఢిల్లీ: బీజూ జనతా దళ్ మాజీ రాజ్యసభ ఎంపీ దేబషిశ్ సమంతరే(Debashish Samantaray) ఇవాళ బీజేపీలో చేరారు. సోమవారం ఆయన బీజేడీ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేడీ నాయకత్వాన్ని విమర్శించారు. ప్రజల ప్రయోజనం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. చాలా కఠినమైన మార్పు అని, కానీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. బీజేడీ పార్టీలో ఆయన చాన్నాళ్లూ అనేక హోదాల్లో పని చేశారు. బీజేడీని వీడిన మూడవ రాజ్యసభ ఎంపీగా దేబషిశ్ నిలిచారు. ఇటీవల మమతా మోహంతా, సుజిత్ కుమార్ కూడా బీజేడీ పార్టీకి రాజీనామా చేశారు. ఏప్రిల్ 2030 వరకు దేబషిశ్ టర్మ్ ఉన్నది. రాజ్యసభలోకి రావడానికి ముందు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సమంతరే వైదొలగడంతో రాజ్యసభలో బీజేడీ బలం కేవలం అయిదుకు చేరుకున్నది.
#WATCH | Delhi | MP Debashish Samantaray joins Bharatiya Janata Party, after he resigned from Biju Janata Dal today. pic.twitter.com/5NJ038kils
— ANI (@ANI) May 26, 2026