Snake | నాముపామును చూశామంటే చాలు శరీరంల వణుకు పుడుతోంది. దాన్నుంచి తప్పించుకోవడం ఎలా? అని ఆలోచిస్తాం. కానీ ఓ మహిళ మాత్రం ఆ నాగుపామును చాకచక్యంగా పట్టేసింది. పామును క్షణాల్లో పట్టేసిన ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కట్టక్కడ గ్రామంలోని ఓ ఇంట్లో నాగుపామును స్థానికులు గుర్తించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు వారు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖకు చెందిన రోషిణి అనే మహిళా ఉద్యోగి తన బృందంతో అక్కడికి చేరుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న నాగుపామును రోషిణి తన బృందంతో క్షణాల్లోనే పట్టేసింది. అనంతరం దాన్ని సమీప అడవుల్లో వదిలేశారు.
అయితే రోషిణి పామును పట్టిన దృశ్యాలను ఇండియన్ ఫారెస్టు సర్వీస్ ఆఫీసర్ సుధా రామేన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అటవీశాఖకు చెందిన రోషిణి అనే మహిళా ఉద్యోగి ధైర్యంగా నాగుపామును పట్టిందని సుధా రామేన్ ప్రశంసించారు. ఆమె పాములను పట్టడంలో శిక్షణ పొందారని తెలిపారు. దేశ వ్యాప్తంగా అటవీశాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. తిరువనంతపురంలోని పారుతిపల్లి రేంజ్ ఆఫీస్లో ర్యాపిడ్ రెస్పార్స్ టీమ్లో రోషిణి ఉద్యోగం చేస్తోంది.
A brave Forest staff Roshini rescues a snake from the human habitations at Kattakada. She is trained in handling snakes.
Women force in Forest depts across the country is growing up in good numbers. VC @jishasurya pic.twitter.com/TlH9oI2KrH
— Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) February 3, 2022