అంతర్జాతీయ విమాన రాకపోకలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. కోవిడ్ కారణంగా అంతర్జాతీయ విమానాల రాకపోకలపై కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాదాపు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి.
‘ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సక్సెస్ అయ్యింది. వ్యాక్సినేషన్ శాతాన్ని కూడా చూశాం. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. సంబంధిత స్టేక్హోల్డర్స్తో కూడా సంప్రదింపులు జరిపాం. ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమానాలపై ఉన్న ఆంక్షలను ఎత్తేస్తున్నాం. అంతర్జాతీయ విమానాలను యథాతథంగా షెడ్యూల్ చేస్తున్నాం. షరతులకు లోబడే ఒక దేశం నుంచి మరో దేశానికి నడుస్తాయి’ అని కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది.