ఇండోర్: కరువును తట్టుకునే సోయాబీన్ పంట రకాన్ని తొలిసారిగా పరిశోధకులు ఆవిష్కరించారు. రైతుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని 25 రోజులు వర్షాలు ఆలస్యమైనా ఎలాంటి నష్టం జరుగకుండా ‘ఎన్ఆర్సీ 36’ సోయాబీన్ పంట రకాన్ని మధ్యప్రదేశ్లోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోయాబీన్ రిసెర్చ్’ (ఐఐఎస్ఆర్) పరిశోధకులు అభివృద్ధి చేశారు. పదేండ్ల పరిశోధన తర్వాత ‘ఎన్ఆర్సీ 36’ సోయాబీన్ రకాన్ని అభివృద్ధి చేశామని, దేశంలోనే కరువును తట్టుకునే మొదటి సోయాబీన్ రకమని ఐఐఆర్సీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ జ్ఞానేశ్కుమార్ తెలిపారు.