నాగ్పూర్: పాక్ ని ఘా సంస్థ ఐఎస్ఐకు రహస్యాలు చేరవేసిన కేసులో బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఇంజినీర్ నిశాంత్ అగర్వాల్కు జీవితఖైదు పడింది. ఈ మేరకు అధికారిక రహస్యాల చట్టం కింద నాగ్పుర్ జిల్లా కోర్టు.. 14 ఏండ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 వేల ఫైన్ వేసింది. నాగ్పుర్లోని బ్రహ్మోస్ సంస్థకు చెందిన కేంద్రంలోని టెక్నికల్ రిసెర్చ్ సెక్షన్లో నిశాంత్ విధులు నిర్వర్తించేవాడు.
ఆ సమయంలో ఐఎస్ఐకు కీలక సమాచారం చేరవేశాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2018లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్, ఉగ్రవాద నిరోధక బృందాలు ఆపరేషన్ నిర్వహించి అరెస్టు చేశాయి. పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశాయి. విచారణ అనంతరం తాజాగా నాగ్పూర్ కోర్టు అతడికి శిక్ష విధించింది.