లక్నో: క్రికెట్ మ్యాచ్ సందర్భంగా గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తిని రాళ్లతో కొట్టి హత్య చేశారు. (Man Stoned To Death) దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం చిపియానా ప్రాంతంలో కొందరు వ్యక్తులు క్రికెట్ మ్యాచ్ ఆడారు. అయితే ఈ సందర్భంగా కొందరి మధ్య గొడవ జరిగింది. 24 ఏళ్ల సుమిత్ దాడి నుంచి తప్పించుకునే క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అదుపు తప్పి కాలువలో పడ్డాడు.
కాగా, సుమిత్ను వెంబడించిన ముగ్గురు వ్యక్తులు రాళ్లతో దాడి చేశాడు. రాయితో తల మీద మోది సుమిత్ను హత్య చేసి పారిపోయారు. ఈ గొడవ గురించి సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సుమిత్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీరట్ జిల్లాకు చెందిన మృతుడి కుటుంబం ఫిర్యాదు ఆధారంగా కీలక నిందితుడు హిమాన్షు, మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు.