బెంగళూరు: కర్ణాటకలో రామనగర తాలూకా టోల్ ప్లాజా వద్ద సిబ్బందిపై కొంతమంది విచక్షణారహితంగా దాడికి తెగబడటంతో పవన్కుమార్(26) అనే ఉద్యోగి చనిపోయాడు. ఆదివారం రాత్రి బెంగళూరుకు ఓ కారు వెళ్తున్నది. టోల్ ఫీజు కట్టాలని సిబ్బంది అడిగారు. అందులోని నలుగురు వ్యక్తులు పవన్కుమార్, మంజునాథ్లపై దాడి చేయగా ఇతర వాహనదారులు గొడవను ఆపారు. అర్ధరాత్రి 12 గంటలకు వారిని నిందితులు మరోసారి కర్రలతో కొట్టడంతో పవన్కుమార్ అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్రగాయాలపాలైన మంజునాథ్ ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.