న్యూఢిల్లీ, జూన్ 12: కొవిడ్-19 కోసం ఉపయోగించే పలు అత్యవసరాలపై జీఎస్టీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అయితే వాక్సిన్లపై మాత్రం 5 శాతం పన్నును కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. పన్ను రేట్ల హేతుబద్దీకరణకు మంత్రుల గ్రూప్ చేసిన సిఫార్సులన్నింటినీ శనివారం నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 44వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఆమోదించింది. అంబులెన్సులపై పన్ను రేటును ప్రస్తుత 28 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, బైపాప్ మెషిన్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, వెంటిలేటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, టెంపరేచర్ చెక్ ఎక్విప్మెంట్, పల్స్ ఆక్సిమీటర్లపై రేటును 12 శాతం నుంచి 5 శాతానికి కుదించారు. కొవిడ్ టెస్టింగ్ కిట్స్పై పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి
‘వ్యాక్సిన్లపై 5 శాతం జీఎస్టీ కొనసాగుతుంది. ఇంతకుముందు ప్రకటించినట్లుగానే కేంద్రం 75 శాతం వ్యాక్సిన్లను కొంటుంది. జీఎస్టీ కూడా చెల్లిస్తుంది. కానీ జీఎస్టీపై వచ్చే ఆదాయంలో 70 శాతం రాష్ర్టాలకు ఇస్తుంది.
వివిధ రకాల కొవిడ్ ఔషధాలపై కూడా పన్ను తగ్గించినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు వాడే టొసిలిజుమాబ్, యాంఫోటెరిసిన్ బీపై ఇకనుంచి జీఎస్టీ వుండదు. ఇప్పటివరకూ వాటిపై 5 శాతంగా వున్న జీఎస్టీని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొవిడ్-19 చికిత్సకు వాడే రెమిడిసివిర్, హెపారిన్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.