న్యూఢిల్లీ : ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 కింద రాష్ట్రాల్లో 30 స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పార్లమెంట్లో బుధవారం 2023-24 ఆర్ధిక సంవత్సర బడ్జెట్ను ప్రవేశపెడుతూ అంతర్జాతీయ అవకాశాలను యువత అందిపుచ్చుకునేందుకు నైపుణ్యాభివృద్ధి కోసం ఈ సెంటర్స్ను నెలకొల్పుతామని వెల్లడించారు.
ఇక మౌలిక వసతుల పెంపు, ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు 50 అదనపు ఎయిర్పోర్టులు, హెలిప్యాడ్లు, వాటర్ ఏరో డ్రోన్స్, అడ్వాన్స్డ్ ల్యాండిగ్ గ్రౌండ్స్ను పునరుద్ధరిస్తామని చెప్పారు.
చిన్నారులు, వయోజనుల కోసం నాణ్యమైన పుస్తకాలను అందుబాటులోకి తీసుకువచ్చేలా నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయనున్నటటు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అక్షరాస్యత కోసం పనిచేసే ఎన్జీఓలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని మంత్రి చెప్పారు.