Flash Floods | జమ్మూ కశ్మీర్ పూంచ్ జిల్లాల్లో ఆదివారం ఆకస్మిక వరదలు పోటెత్తాయి. వరద నీటిల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు కొట్టుకుపోయి మృతి చెందారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం తెలిపింది. పూంచ్లోని కఠినమైన ఏరియాలో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో నదిని దాటుతున్న సమయంలో నాబ్ సుబేదార్ కుల్దీప్ సింగ్ ఆకస్మిక వరదలో కొట్టుకుపోయాడని రక్షణ ప్రతినిధి తెలిపారు. ఆయన అత్యున్నత త్యాగానికి ఆర్మీకి చెందిన అన్ని శ్రేణులు సెల్యూట్ చేస్తున్నాయని, మృతుడి కుటుంబానికి భారత సైన్యం సంఘీభావంగా నిలుస్తుందని పేర్కొన్నారు. కుల్దీప్ సింగ్ పంజాబ్ తర్న్ తరణ్లోని చభల్ కలాన్ నివాసి. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే పూంచ్ జిల్లాలో పెట్రోలింగ్ సమయంలో లాన్స్ నాయక్ తేలు రామ్ పర్వత ప్రాంతంలో ప్రవాహాన్ని దాటుతుండగా కొట్టుకుపోయాడని సైన్యం తెలిపింది. ఇదిలా ఉండగా.. రాగల 24 గంటల్లో కతువా, సాంబా, రాంబన్ ఉదంపూర్ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.
During an area domination patrol in J&K's Poonch, Lance Naik Telu Ram while crossing a mountainous stream got swept away due to flash floods, says Indian Army. pic.twitter.com/2l18D45x0W
— ANI (@ANI) July 9, 2023