జైపూర్ : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు పోలీసులు సహా మరో వ్యక్తి ఉన్నారు. పోలీసులు గుజరాత్కు చెందిన వారని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. నిందితుడిని ఢిల్లీ నుంచి గుజరాత్కు తీసుకువెళ్తున్న సమయంలో రాజస్థాన్లోని భబ్రూ ప్రాంతంలో పోలీసుల వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు ఢీకొట్టడంతో పోలీసుల వాహనం నుజ్జునుజ్జయ్యింది.