న్యూఢిల్లీ: జైలులోని ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు, కత్తులు, హీటర్లు, ఫోన్ చార్జర్లు, పెన్ డ్రైవ్లు వంటి వస్తువులు ఉన్నాయి. తనిఖీల సందర్భంగా వీటిని జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఐదుగురు జైలు అధికారులను సస్పెండ్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మండోలి జైలులో ఖైదీల వద్ద నిషేధిత వస్తువులు ఉన్నట్లు ఉన్నతాధికారులకు తెలిసింది. ఈ నేపథ్యంలో జైలు వార్డుల్లో తనిఖీలు చేయాలని జైలు సూపరింటెండెంట్లను జైళ్ల డైరెక్టర్ జనరల్ సంజయ్ బనివాల్ ఇటీవల ఆదేశించారు. ఈ నేపథ్యంలో జనవరి 3న జైలు నంబర్ 8, 9లోని ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లతోపాటు నిషేధిత వస్తువులు లభించాయి. ఏడు మొబైల్ ఫోన్లు, మూడు కత్తులు, ఒక గది హీటర్, ఆరేడు హీటర్లు, ఒక మొబైల్ ఫోన్ ఛార్జర్, రెండు పెన్ డ్రైవ్లు, రెండు నీటి కెటిల్స్ స్వాధీనం చేసుకున్నారు.
కాగా, గత 15 రోజుల్లో 117 మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులు జైలులో లభించాయి. ఈ నేపథ్యంలో ఐదుగురు జైలు అధికారులపై చర్యలు చేపట్టారు. జైలు డిప్యూటీ సూపరింటెండెంట్లు ప్రదీప్ శర్మ, ధర్మేందర్ మౌర్య, అసిస్టెంట్ సూపరింటెండెంట్ సన్నీ చంద్ర, హెడ్ వార్డర్ లోకేష్ ధామా, వార్డర్ హన్సరాజ్ మీనాను సస్పెండ్ చేశారు. మండోలి జైలులో తనిఖీలు ఇకపైనా కొనసాగుతాయని ఉన్నతాధికారులు తెలిపారు.