థానే: మహారాష్ట్రలోని నవీముంబై టౌన్షిప్కు చెందిన అయిదుగురు మైనర్ అమ్మాయిలు(Minor Girls) అదృశ్యం అయ్యారు. రెండు కుటుంబాలకు చెందిన ఆ అమ్మాయిలు శనివారం నుంచి కనిపించడం లేదు. ఆ అమ్మాయిల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. తలోజా ఏరియాలోని లక్కీ కాంప్లెక్స్ నుంచి ఆ అమ్మాయిలు మిస్సింగ్లో ఉన్నారు. 14, 16 ఏండ్ల ఇద్దరు అక్కాచెల్లెళ్లు శనివారం ఉదయం నుంచి ఆచూకీ లేరు. స్కూల్కు వెళ్లిన వాళ్లు మళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. ఇక మరో ఘటనలో 5, 7, 14 ఏళ్ల అమ్మాయిలు కూడా మిస్ అయ్యారు. ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఆదివారం కేసును రిజిస్టర్ చేశారు.