ముంబై: మహారాష్ట్రలోని పుణె జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది. పుణె-అహ్మద్నగర్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగని లారీ మరో రెండు మోటార్ సైకిళ్లపైకి దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరొకరు దవాఖానలో చనిపోయారని పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.