బెంగళూరు : కర్నాటకలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ ఊపిరాడక ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళూరులో ఆదివారం రాత్రి జరిగింది. మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కూలీలందరూ పశ్చిమ బెంగాల్కు చెందిన వారు. ఓ కార్మికుడు చెత్త సేకరణ ట్యాంక్లో అపస్మారక స్థితిలో పడిపోయాడని కమిషనర్ తెలిపారు. అతన్ని కాపాడేందుకు మరో ఏడుగురు ట్యాంక్లోకి వెళ్లగా స్పృహ తప్పి పడిపోయారన్నారు.
వారందరినీ ఏజే ఆసుపత్రికి తరలించగా.. రాత్రి ముగ్గురు మృతి చెందారని, ఇవాళ ఉదయం మరో ఇద్దరు ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించినట్లు చెప్పారు. మృతులంతా పశ్చిమ బెంగాల్కు చెందిన వారని, వారి వయసు 20-22 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు. ఐసీయూలో ఉన్న మరో ముగ్గురి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిపారు. ఘటనలో మేనేజర్, సూపర్వైజర్పై సెక్షన్ 304 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రొడక్షన్ మేనేజర్ రూబీ జోసెఫ్, ఫీల్డ్ మేనేజర్ కుబేర్ గాడే, సూపర్వైజర్లు మహ్మద్ అన్వర్, ఫరూక్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.