జెరూసలేం: హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల ఉత్తర గాజాలోని అతిపెద్ద దవాఖాన షిఫా, మరికొన్ని దవాఖానాల్లో అంధకారం అలుముకుంది. వైద్య పరికరాలు, ఔషధాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఐసీయూ రోగులు చనిపోతున్నారని షిఫా దవాఖాన డైరెక్టర్ అబు సెల్మియా శనివారం మీడియాకు తెలిపారు. జనరేటర్లు షట్డౌన్ కావటంతో నవజాత శిశువు సహా ఐదుగురు చనిపోయారని గాజా అధికార వర్గాలు వెల్లడించాయి.