ముంబై, అక్టోబర్ 1: అక్రమంగా తరలిస్తున్న 4.6 కిలోల ఎపెడ్రైన్ డ్రగ్ ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ముంబైలోని అందేరీ నుం చి ఎగుమతికి సిద్ధంగా ఉన్న పరుపుల్లో నిందితులు ఈ డ్రగ్ను దాచిపెట్టినట్టు అధికారులు తెలిపారు. ప్రాథమిక ఆధారా ల ప్రకారం హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన ఈ డ్రగ్ను ముంబై గుండా ఆస్ట్రేలియాకు ఎగుమతి చేయాలనుకున్నట్టు పేర్కొన్నారు. విపణిలో దీని విలువ రూ. 5 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేశారు.