రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని (Chattisgarh) రాజ్నంద్గావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. రాజ్నంద్గావ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టి బోల్తాపడింది. అనంతరం కారులో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ఐదుగురు కాలి బూడిదయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని, వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.