జమ్ము: జమ్ముకశ్మీర్లోని బారాముల్లాలో (Baramulla) మద్యం దుకాణంపై ఉగ్రదాడిని పోలీసులు ఛేదించారు. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులతోపాటు లష్కరే తొయిబాకు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో బారాముల్లాలో కొత్తగా ఓపెన్ అయిన వైన్ షాప్పు ఉగ్రవాదులు గ్రనేడ్తో దాడి చేశారు. ఈ ఘటనలో మద్యం దుకాణంలో పనిచేస్తున్న నలుగురు గాయపడగా, మరొకరు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
దాడికి పాల్పడిన ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు. వారినుంచి ఐదు తుపాకులు, 23 గ్రనేడ్లు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వారికి అనేక ఉగ్ర ఘటనల్లో ప్రమేయమున్నట్లు వెల్లడించారు.