బెంగళూరు, ఆగస్టు 11: చేపల చెవుల్లోని ఎముకల సహాయంతో సముద్రపు నీటి ఉష్ణోగ్రతను బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. చేపల చెవుల్లోని చిన్న ఎముకలు ‘ఓటోలిత్స్’తో సముద్రపు నీటి ఉష్ణోగ్రతను చెప్పవచ్చని వెల్లడించారు.
జురాసిక్ కాలం నాటి చేపల అవశేషాలు, ఇటీవలి చేపల నుంచి సేకరించిన ఎముకల్లోని కాల్షియం ఐసోటోప్స్ తేడాలను థర్మల్ అయనైజేషన్ మాస్ స్పెక్ట్రోమీటర్ సహాయంతో గుర్తించామని తెలిపారు. దాన్ని బట్టి సముద్రపు ఉష్ణోగ్రత ఎంత వరకు పెరిగిందనేది తెలుసుకొన్నామని పేర్కొన్నా రు. సముద్రపు నీటి ఉష్ణోగ్రత రెండు డిగ్రీలు పెరిగినా కోట్ల జలచరాలు అంతమవుతాయని వెల్లడించారు.