ఇంఫాల్: కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఈశాన్య రాష్ట్రాలకూ వ్యాపించింది. మణిపూర్లో తొలి కేసును గుర్తించారు. ఈ నెల 13న టాంజానియా నుంచి తిరిగి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్గా సోమవారం నిర్ధారణ అయ్యిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్ సోకిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ఇంఫాల్లోని ఐసొలేషన్ కేంద్రంలో అతడు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య సేవల డైరెక్టర్ కే రాజో సింగ్ వెల్లడించారు. విదేశాల నుంచి మణిపూర్కు వచ్చిన 480 మంది ఆరోగ్య పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు చెప్పారు. ఇందులో 174 మంది 14 రోజుల క్వారంటైన్ను పూర్తి చేసుకున్నారని, మరోసారి నిర్వహించిన కరోనా పరీక్షలో కూడా నెగిటివ్ వచ్చిందన్నారు. మిగతా 306 మంది అబ్జర్వేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు మణిపూర్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా 17 కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 2.39 శాతంగా ఉన్నది.