న్యూఢిల్లీ, అక్టోబర్ 19: దేశవ్యాప్తంగా తలపెట్టిన ఆక్సిజన్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా మొట్టమొదటి ఇంటర్నెట్ ఆధారిత మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభమైంది. కర్ణాటకలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ ఆశ్రమంలో దేశంలోనే తొలి ఆక్సిజనరేటర్ ‘ఆక్సి ఎయిడ్’ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ బుధవారం ఆవిష్కరించారు.
అవసరమైన చోటే ఆక్సిజన్ ఉత్పత్తి, సిలిండర్లో నింపే సదుపాయంతోపాటు దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ అవసరమైనవారికి అక్కడికక్కడే సిలిండర్లు లభించేలా చూడటం ఈ గ్రిడ్ లక్ష్యాలు. ఇందులో భాగంగా మొదటి ట్రక్కు రోడ్డెక్కింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సులభంగా, తక్కువ ధరకు మెడికల్ ఆక్సిజన్ అందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని రవిశంకర్ తెలిపారు.