న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ (Omicran) కేసులు 35కు చేరాయి. పంజాబ్, హర్యానా ఉమ్మడి రాజధాని అయిన చండీగఢ్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదయింది. నవంబర్ 22న ఇటలీ నుంచి వచ్చిన 20 ఏండ్ల యువకుడికి ఈ వైరస్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 1న అతనికి కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో పాజిటివ్ వచ్చిందని చెప్పారు. దీంతో అతని నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపామని, అందులో ఒమిక్రాన్ సోకినట్లు తేలిందన్నారు. అతడు ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాడని వెల్లడించారు. తాజాగా కరోనా పరీక్ష చేశామని, ఫలితాల కోసం చూస్తున్నామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఒమిక్రాన్ కేసు నమోదయినట్లు ఆదివారం మధ్యాహ్నం అధికారులు ప్రకటించారు. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏండ్ల వ్యక్తి గత నెలలో ఐర్లాండ్ నుంచి విశాఖపట్నం వచ్చాడని, అతనికి పరీక్షలు చేయగా ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని తెలిపారు. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 35కు చేరింది. ఇప్పటికే మహారాష్ట్రలో 17, గుజరాత్లో 9, గుజరాత్లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో రెండు చొప్పున కేసులు నమోదయ్యాయి.
A 20-year-old man from Italy, who landed in India on Nov 22 & was diagnosed with COVID on Dec 1, has tested positive for #Omicron variant. He is fully vaccinated with Pfizer vaccine. He has been tested for COVID-19 again today & the report is awaited: Chandigarh Health department
— ANI (@ANI) December 12, 2021